ప్రవేశ పరీక్షల షెడ్యూల్లో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి పలు మార్పులు చేసింది. ఎంసెట్, లాసెట్, పీజీ ఈసెట్, లాసెట్, పీజీ ఎల్సెట్ పరీక్షలకు సంబంధించి మారిన తేదీలను ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి ప్రకటించారు.
మారిన షెడ్యూల్ ప్రకారం..
మే నెల 4, 7, 8 తేదీల్లో ఇంజినీరింగ్ ఎంసెట్, మే 9, 11వ తేదీల్లో ఫార్మా ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. మే 27న లాసెట్, పీజీ ఎల్సెట్, మే 28 నుంచి 31 వరకు పీటీ ఈసెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.