- కొన్ని వందల మందికి ఉపాధి కల్పిస్తున్నాడు
అమర్ ప్రజాపతి...యూపీ లోని గోరఖ్పూర్లో 14 ఏండ్ల అబ్బాయి. వయసు చిన్నదే అతని ఆలోచనలు గొప్పవి. ఆ ఆలోచనల్లో ఎలాంటి స్వార్థం కనిపించదు. పక్కనోడు బాగుండాలనే ఆశ మాత్రమే ఉంటుంది. అందుకోసం ఏదైనా చేయాలన్న తాపత్రయం కనిపిస్తుంది. ఆ తాపత్రయమే ఎల్ఈడీ బల్బ్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీని స్టార్ట్ చేయించింది. కొన్ని వందలమందికి ఉపాధి కల్పిస్తోంది. కరోనా వైరస్ కొన్ని లక్షల మంది ఉద్యోగాల్ని మింగేసింది. కష్టకాలంలో తినడానికి తిండిలేక ఎంతోమంది అల్లాడారు. అమర్ ఊళ్లోనూ ఇదే పరిస్థితి. తిండి, బట్టల కోసం జనం ఇబ్బంది పడుతుంటే అమర్ ఏదైనా చేయాలనుకున్నాడు. ఎల్ఈడీ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ పెట్టాలనుకున్నాడు. గోరఖ్పూర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీలో ఎల్ఈడీ బల్బ్ల మేకింగ్ కోర్సుల చేరాడు. మొదట ఇంట్లో బల్బ్ల తయారీ మొదలుపెట్టాడు. ఆ తర్వాత ‘జీవన్ ప్రకాష్’ ఎల్ఈడీ బల్బ్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ పెట్టాడు. ఊళ్లోని జనాలకి బల్బ్ తయారీలో ట్రైనింగ్ ఇచ్చి కంపెనీలో పని కల్పిస్తున్నాడు.