- మున్సిపల్ మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి
అమీన్పూర్, వెలుగు: పేద, మధ్య తరగతి వాళ్లు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి సూచించారు. ఆదివారం మున్సిపల్ పరిధిలోని 17వ వార్డులో క్రోమ్ వెల్ ఆస్పత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.
అనంతరం ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ఆరోగ్యంపై దృష్టి పెట్టాలన్నారు. శారీరక శ్రమ అవసరమని, ప్రతీ రోజు వాకింగ్, యోగా చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మల్లేశ్, నాయకులు యాదగిరి, హాస్పిటల్ ప్రతినిధులు, సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
