
వాషింగ్టన్: ఇండియాకు అమెరికా ఎప్పుడూ అండగా ఉంటుందని బైడెన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు స్పష్టంచేశారు. అమెరికా నుంచి ఒత్తిడి పెరుగుతున్నాసరే రష్యా నుంచి ఇండియా, మరికొన్ని ఆసియా దేశాలు క్రూడాయిల్ను దిగుమతి చేసుకుంటున్నాయని, ఈ విషయంలో ఇండియా అధికారులతో చర్చలు జరిపారా? అని మీడియా అడిగిన ప్రశ్నలకు వారు స్పందించారు. మాస్కోతో ఇండియా రిలేషన్స్ ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతున్నాయని, ఇండియన్ గవర్నమెంట్ను భాగస్వామిగా చేసుకునేందుకు అమెరికా సిద్ధంగా లేనప్పుడూ ఆ రెండు దేశాల మధ్యా సత్సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇండియా ప్రతినిధులతో తాము చాలాసార్లు చర్చలు జరిపామని, అయితే మాస్కోతో ఒక్కో దేశం ఒక్కో రకమైన సంబంధాలు కలిగి ఉందనే విషయం తమకు తెలుసని అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ ప్రతినిధి నెడ్ ప్రైస్ మీడియాకు చెప్పారు. ప్రస్తుతం సౌది అరేబియా కంటే ఎక్కువగా ఇండియా రష్యా నుంచి ఆయిల్ ను దిగుమతి చేసుకుంటోంది. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా క్రూడాయిల్ ధరలు పెరిగినా.. భారీ డిస్కౌంట్తో రష్యా ఇండియాకు క్రూడాయిల్ను సరఫరా చేస్తోంది.