
రష్యన్ చమురు కొనుగోలు చేసే దేశాలపై జరిమానా సుంకాలు విధిస్తామని అమెరికా బెదిరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇండియా అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి కీలక చర్చలు కొనసాగుతున్న వేళ ఇది చాలా కీలకంగా మారుతోంది. వాస్తవానికి రష్యా నుంచి ఆయిల్ ఉత్పత్తులతో పాటు ఇతర అన్ని వస్తువుల దిగుమతులపై 100 శాతం సెకండరీ సుంకాన్ని విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
ఈ క్రమంలో ఉక్రెయిన్ పై యుద్ధాన్ని ఆపేందుకు రష్యాకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 50 రోజులు గడువును ఇస్తున్నట్లు చెప్పారు. అయితే రష్యా ఆయిల్ ద్వారా వస్తున్న తగ్గింపుల కంటే ట్రంప్ ప్రకటించిన సుంకాల ఖర్చు ఎక్కువగా ఉండటంతో భారత్ డైలమాలో పడింది. వాస్తవానికి రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పశ్చిమ దేశాల ఆంక్షల కారణంగా చమురును తగ్గింపు రేట్లకు రష్యా ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే. యుద్ధానికి ముందు 1 శాతం క్రూడ్ ఆయిల్ మాత్రమే రష్యా నుంచి కొన్ని ఇండియా ప్రస్తుతం దాదాపు 30 శాతానికి పైగా చమురును కొనుగోలు చేస్తోంది.
2022 ఫిబ్రవరి నుంచి భారతదేశంలోని క్రూడ్ ఆయిల్ రిఫైనింగ్ కంపెనీలు కూడా తగ్గింపు రేట్లతో చమురును రష్యా నుంచే ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నాయి. అయితే ట్రంప్ ఇచ్చిన 50 రోజుల గడువుకు ఇంకా చాలా కాలం ఉండటంతో ఇప్పటికిప్పుడే వచ్చిన ప్రమాదం లేదని ఈ సంస్థలు భావిస్తున్నాయి.
గతంలో అమెరికా రష్యాలోని ఆంక్షలు విధించబడి నిషేధించబడిన సంస్థలతో వ్యాపారం చేసే కంపెనీలు లేదా సంస్థలకు మాత్రమే జరిమానా విధించేది. అయితే ప్రస్తుతం పాశ్చాత్య మీడియాలో వస్తున్న కథనాలను ప్రకారం ప్రస్తుతం అమెరికా రష్యాతో వ్యాపారం చేస్తున్న దేశాల ఉత్పత్తుల ఎగుమతులపై నేరుగా సుంకాలను అప్లై చేయాలని చూస్తున్నట్లు వెల్లడైంది. అంటే ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయటం కొనసాగిస్తే ఇండియా నుంచి అమెరికాకు వెళ్లే వస్తువులు లేదా ఉత్పత్తులపై నేరుగా ట్రంప్ ప్రకటించే సుంకాలు అమలులోకి వస్తాయి. దీనికి ముందు మంగళవారం రోజున రష్యా ఎగుమతులపై అమెరికా ఏకంగా 100 శాతం సుంకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో భారత రిఫైనరీలు రష్యా స్థానంలో బ్రెజిల్ సహా గత పాత కొనుగోలుదారుల నుంచి తిరిగి చమురు ఆర్డర్ చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం కొనుగోలు రేటు కంటే బ్యారెల్ ధర సుమారు 5 డాలర్ల వరకు ఎక్కువయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.