ఎల్​ఐసీ ఐపీఓ వాయిదా ?

ఎల్​ఐసీ ఐపీఓ వాయిదా ?

న్యూఢిల్లీ: ఉక్రెయిన్​ వార్​ నేపథ్యంలో ఎల్ఐసీ మెగా ఐపీఓ కొంత కాలం వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. సరయిన విలువను రాబట్టుకునేందుకే ఎల్ఐసీ మెగా ఐపీఓను  వాయిదా వేయాలనుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్​పై రష్యా పూర్తి స్థాయిలో యుద్ధం చేస్తున్న నేపథ్యంలో అటు గ్లోబల్​ మార్కెట్లు, ఇటు దేశీయ మార్కెట్లు పడుతున్నాయి. ఇలాంటి టైము ఎల్​ఐసీ లాంటి మెగా ఐపీఓకు సరయినది కాదని ప్రభుత్వం ఆలోచిస్తోంది. గ్లోబల్​ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నట్లు ఫైనాన్స్​ మినిస్టర్ నిర్మలా సీతారామన్​ కూడా ఇప్పటికే సూచించారు. ఎల్​ఐసీ ఐపీఓను ముందుకు తీసుకు వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలంగా లేవని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నిర్మల చెప్పారు. గ్లోబల్​ పరిస్థితుల ప్రకారం ఎల్​ఐసీ  ఐపీఓ ప్లాన్​ను మరోసారి పరిశీలించాల్సిన అవసరం కనిపిస్తోందని పేర్కొన్నారు. ముందుగా అనుకున్న ప్లాన్​ ప్రకారమైతే ఎల్​ఐసీ ఐపీఓ ఈ నెలలో ఉండాలి. ఎల్​ఐసీలో 5 శాతం వాటా అమ్మి రూ. 63 వేల కోట్లు సమీకరించాలని ప్రభుత్వం ప్లాన్​ చేసింది. ఈ ఫైనాన్షియల్​ ఇయర్​కు పెట్టుకున్న డిజిన్వెస్ట్​మెంట్ టార్గెట్​ను ప్రభుత్వం అందుకోవడానికి ఎల్​ఐసీ ఐపీఓ కీలకంగా మారింది. ఒకవేళ ఈ ఐపీఓ వాయిదా పడితే ప్రభుత్వం తన టార్గెట్ ​మిస్​ అవుతుంది.​

For more news..

వడ్లు కొనకుంటే రైతులు నష్టపోయే ప్రమాదం

రష్యా ​ఆర్మీ కాన్వాయ్ ముందుకెళ్తలే!