వలస కార్మికులకు బిగ్‌బీ సాయం

వలస కార్మికులకు బిగ్‌బీ సాయం
  • యూపీ వెళ్లేందుకు 10 బస్సులు ఏర్పాటు

ముంబై: బాలీవుడ్‌ స్టార్‌‌ బిగ్‌బి మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. యూపీకి చెందిన వలస కార్మికులు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు 10 బస్సులను ఏర్పాటు చేశారు. ముంబైలోని హజీ అలీ దర్గా నుంచి శుక్రవారం ఉదయం 10 బస్సులు బయలుదేరి వెళ్లాయి. ఏబీసీఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌‌ రాజేశ్‌ యాదవ్‌, మాహిం దర్గా ట్రస్ట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌‌ సుహేల్‌ ఖండ్వానీ పచ్చజెండా ఊపి బస్సులు ప్రారంభించారు. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌, గోరఖ్‌పూర్‌‌, భదోయ్‌, లక్నో ప్రాంతాలకు బస్సులను ఏర్పాటు చేసినట్లు సుహేల్‌ అన్నారు. బస్సులో ప్రతిఒక్కరు సోషల్‌ డిస్టెంసింగ్‌ పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నామని, వారికి శానిటైజర్లు, గ్లౌజులు కూడా అందించామని అన్నారు. అమితాబ్‌ గతంలో ఆల్‌ ఇండియా ఫిల్మ్‌ ఎంప్లాయీస్‌ కాన్ఫిడరేషన్‌కు చెందిన లక్ష రోజువారీ కూలీ కార్మికుల కుటుంబాలకు నెలకు సరిపడ రేషన్‌ అందించారు. లాక్‌డౌన్‌ వల్ల పనులు కోల్పోయిన వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మేరకు వారికి బాలీవుడ్‌ యాక్టర్‌‌ సోనూసూద్‌ సాయం చేసిన విషయం తెలిసిందే.