'భారత్ మాతా కీ జై'.. ట్వీట్ తో మద్దతు తెలిపిన బిగ్ బీ

'భారత్ మాతా కీ జై'.. ట్వీట్ తో మద్దతు తెలిపిన బిగ్ బీ

ఇండియా పేరు మార్పుపై వస్తున్న వార్తలపై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ స్పందించారు. రాజ్యాంగం నుంచి ఇండియా అనే పదాన్ని తొలగించి, దేశ అధికారిక పేరును ‘భారత్’గా మార్చాలని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా స్పందించిన బిగ్ బీ తన అధికారిక X ఖాతాలో ఓ ఇంట్రస్టింగ్ పోస్టు చేశారు. పేరు మార్పుకు తన మద్దతును అందించాడు. భారత్ మాతా కీ జై అంటూ ఈ పోస్టులో రాసుకువచ్చారు.

ఇండియా పేరు 'భారత్'గా మార్చడాన్ని ఆమోదించినందుకు నెటిజన్లు అమితాబ్ ను ప్రశంసిస్తున్నారు. ఓ వర్గం యూజర్స్ మాత్రం అయనకు వ్యతిరేకంగా కామెంట్లు పెడుతూ ట్రోల్ చేస్తున్నారు. కొంతమంది ట్విట్టర్ యూజర్స్ ఇది 'పెయిడ్ ట్వీట్' అంటూ విమర్శిస్తున్నారు. సెప్టెంబరు 18 నుంచి 22 వరకు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో 'ఇండియా' పదాల తొలగింపు ప్రతిపాదనకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం సమర్పించే అవకాశం ఉంది.

అమితాబ్ ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఫిల్మ్ ఫ్రంట్‌లో, అతను కల్కి 2898 ADలో ప్రభాస్, దీపికా పదుకొనే సరసన కనిపించనున్నారు. దాంతో పాటు ఆయన దీపికతో ది ఇంటర్న్ హిందీ రీమేక్ డయానా పెంటీతో రిభు దాస్‌గుప్తా సెక్షన్ 84లోనూ నటించనున్నారు.