మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ఆమెకు పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడు తనకు నచ్చిన సాంగ్కు డ్యాన్స్ కూడా చేస్తూ ఉంటారు. తాజాగా మూడ్ బనాలియా సాంగ్కు అమృతా ఫడ్నవీస్ స్టెప్పులు వేశారు. తన కొత్త సాంగ్తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఆ సాంగ్లో నెటిజన్లకు ఛాలెంజ్ కూడా విసిరారు. ఆ పాటను వాడుకుని ఓ రీల్ చేసి తమకు హ్యాష్ ట్యాగ్ చేయాలని అమృతా ఫడ్నవీస్ ట్విట్టర్లో కోరారు.
ఆమె ట్వీట్ చేసిన కొన్ని క్షణాల్లోనే లక్షలాది వ్యూస్ వచ్చాయి. మిసెస్ ఫడ్నవీస్ డ్యాన్స్ బాగా చేస్తున్నారంటూ నెటిజెన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మూడ్ బనాలియా సాంగ్ను అమృత ఫడ్నవీస్ జనవరి 6న రిలీజ్ చేశారు. యూట్యూబ్లో రిలీజైన ఈ పాటకు ఇప్పటివరకు 2.2 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఆర్టిస్ట్ మీట్ బ్రోస్, అమృతా ఫడ్నవీస్ ఈ వీడియోను రూపొందించారు. ఐశ్వర్య త్రిపాఠి దీనికి సంగీతం అందించారు.