
న్యూఢిల్లీ: సిమ్యులేటర్ల సప్లై కోసం డిఫెన్స్ ట్రెయినింగ్ సొల్యూషన్స్ కంపెనీ జెన్ టెక్నాలజీస్కు ఆర్మీ నుంచి రూ.127 కోట్ల ఆర్డర్ వచ్చింది. ఆర్మ్డ్ ఫోర్సుల్లో సిమ్యులేటర్ల వాడకాన్ని ప్రభుత్వం భారీగా పెంచిందని జెన్ టెక్నాలజీస్ సీఎండీ అట్లూరి అశోక్ చెప్పారు. దేశంలో తయారైన సిమ్యులేటర్లను వాడటం వల్ల ట్రైనింగ్ బాగా ఇవ్వవచ్చని, డబ్బు కూడా ఎంతో ఆదా అవుతుందని వివరించారు. హైదరాబాద్కు చెందిన ఈ కంపెనీ సెక్యూరిటీ ఫోర్సెస్ ట్రైనింగ్ అవసరాల కోసం సెన్సర్లు, సిమ్యులేటర్లు, డ్రోన్లు, యాంటీ–డ్రోన్లు తయారు చేస్తుంది. గడచిన పదేళ్లలో తాము పూర్తిస్థాయి టర్న్ ఎరౌండ్ సాధించామని అశోక్ చెప్పారు. సమీప భవిష్యత్లో తమకు మరిన్ని పెద్ద కాంట్రాక్టులు దక్కే అవకాశం ఉందన్నారు. అగ్నిపథ్ కార్యక్రమానికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.