దుబాయ్: గ్లోబల్ చెస్ లీగ్ (జీసీఎల్)లో పాల్గొనే ప్లేయర్ల లిస్ట్ను నిర్వాహకులు మంగళవారం విడుదల చేశారు. ఇండియా గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్తో పాటు వరల్డ్ టాప్ ర్యాంకర్ మాగ్నస్ కార్ల్సన్, వరల్డ్ చాంపియన్ డింగ్ లీరెన్, నాలుగుసార్లు విమెన్స్ వరల్డ్ చాంపియన్ హు యిఫాన్ మెగా లీగ్లో బరిలోకి దిగుతున్నారు.
టెక్ మహీంద్రాతో కలిసి ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ (ఫిడే) ఈ టోర్నీని నిర్వహిస్తున్నది. దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో అక్కడి చెస్ అండ్ కల్చర్ క్లబ్లో జూన్ 21 నుంచి జులై 2 వరకు తొలి సీజన్ పోటీలు జరగనున్నాయి. ఉమ్మడి టీమ్ ఫార్మాట్లో మ్యాచ్లు ఉంటాయి. ప్రతి టీమ్లో ఆరుగురు ప్లేయర్లు ఉంటారు. ఇందులో కనీసం ఇద్దరు మహిళా ప్లేయర్లు ఉండాలి.