భలే రియాక్ట్ అవుతారే.. ఏం తెలివిరా మీది

 భలే రియాక్ట్ అవుతారే.. ఏం తెలివిరా మీది

బుల్లితెర స్టార్ యాంకర్ మరోసారి ట్రోలర్స్ చేతికి చిక్కింది. దీంతో ఆమెను ఓ ఆట ఆడేసుకున్నారు నెటిజన్స్. దానిపై కూడా తన స్టైల్లో రియాక్ట్ అయ్యింది అను. ప్రస్తుతం అనసూయ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకి అసల విషయం ఏంటంటే తాజాగా అనసూయ ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టింది.. "ఇప్పుడే ఒకటి చూశాను. ది నా? బాబోయ్ పైత్యం.. ఏం చేస్తాం అంటకుంటా చూసుకుందాం. అంటూ కామెంట్ చేసింది.

ఆమె అర్జున్ రెడ్డి సినిమా గురించి నాన్సెన్స్ అని పోస్ట్ పెట్టినట్లు రౌడీ ఫ్యాన్స్ కి అర్థమైంది. దీంతో అనుపై  కామెంట్స్ చేస్తూ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. వాళ్ళు చేసిన కామెంట్స్ కి మళ్ళీ రియాక్ట్ అయిన అనసూయ "భలే రియాక్ట్ అవుతార్ రా దొంగ ఊప్స్… బంగారుకొండలంతా. ఎక్కడో అక్కడ నేను నిజం అని ప్రూవ్ చేస్తూ ఉన్నందుకు థాంక్స్ అంటూ పోస్ట్ పెట్టింది. దీనిపైన కూడా రౌడీ ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపించారు.

మొత్తానికి అనసూయ మరోసారి ఇలా రౌడీ ఫాన్స్ కామెంట్స్ కి బలైంది.  ఇదిలా ఉంటే అర్జున్ రెడ్డి సినిమా విడుదల నుండి విజయ్ దేవరకొండ, అనసూయకి మధ్య ఏదో తెలియని వైరం నడుస్తోంది. అర్జున్ రెడ్డి సినిమా విషయంలో లైవ్ డిబేట్ లో అనసూయ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. లైగర్ ఫ్లాప్ అయినపుడు కూడా అందరికంటే ఎక్కువ సంతోషించింది అనసూయనే. ఇక తాజా ట్వీట్ తో.. అనసూయ అర్జున్ రెడ్డి ప్రభావం నుంచి ఇంకా బయటకి రాలేదనే క్లియర్ గా అర్థమవుతోంది.