లారీని ఢీ కొట్టిన కారు.. ఒకరు మృతి

లారీని ఢీ కొట్టిన కారు.. ఒకరు మృతి

సూర్యపేటజిల్లా  ముకుందాపురం హైవే వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని వెనక నుంచి వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మృతుడు ఆంధ్రజ్యోతి పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ కోగంటి శేషగిరిరావు కుమారుడు సతీష్ బాబుగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళుతుండగా మార్గ మధ్యలోని ముకుందాపురం వద్దకు రాగానే ముందు వెళ్తున్న లారీని వెనక నుంచి ఢీ కొట్టాడు. దీంతో కారు లారీ వెనుక భాగంలో ఇరుక్కుపోయి అతను అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న  పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని  పోస్టుమార్టం కోసం కోదాడ ఆస్పత్రికి తరలించారు.