రంగారెడ్డి జిల్లాలో అంగన్వాడీ వర్కర్ల వంటావార్పు

రంగారెడ్డి జిల్లాలో అంగన్వాడీ వర్కర్ల వంటావార్పు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో అంగన్ వాడీ కార్యకర్తలు తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలంటూ నిరసన చేపట్టారు. ఇందులో భాగంగా ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్, సీపీఎం పార్టీల నాయకులు సంఘిభావం తెలిపారు. 

Also Read :- గాంధీ హాస్పిటల్ లో ఔట్ సోర్సింగ్ నర్సుల ధర్నా..

అంగన్ వాడి కార్యకర్తల న్యాయమైన డిమాండ్ లను వెంటనే తీర్చాలని, పనికి తగ్గ వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అంగన్వాడీలను రెగ్యులరైజ్ చేసి ప్రభుత్వ కార్మికులుగా గుర్తింపు ఇవ్వాలని కోరారు. అంగన్ వాడి కార్యకర్తల సమ్మెకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు, వారికి అండగా ఉంటామని సీపీఎం నాయకులు తెలిపారు.