
న్యూఢిల్లీ: టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) చైర్మన్గా రైల్వే బోర్డు మాజీ చీఫ్ అనిల్ కుమార్ లహోటీ నియమితులయ్యారు. మాజీ చైర్మన్ పీడీ వాఘేలా పదవీకాలం నాలుగు నెలల క్రితం ముగియడంతో ట్రాయ్లో అత్యున్నత స్థానం ఖాళీ అయింది.
ఆయనను మూడేళ్ల కాలానికి ట్రాయ్ ఛైర్మన్గా నియమించడానికి క్యాబినెట్ నియామకాల కమిటీ ఒప్పుకుంది.