యానిమల్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. చెప్పిన డేట్కే OTTకి వచ్చేస్తోంది

యానిమల్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. చెప్పిన డేట్కే OTTకి వచ్చేస్తోంది

యానిమల్(Animal) సినిమా బాక్సాఫీస్ దగ్గర క్రియేట్ చేసిన సంచనాలు అన్నీ ఇన్నీ కాదు. సౌత్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ(Sandeep reddy vanga) బాలీవుడ్ లో తెరకెక్కించిన ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్(Ranbir kapoor), నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) జంటగా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. కేవలం రూ.250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా దాదాపు రూ.900 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. తెలుగు డైరెక్టర్ కావడంతో సౌత్ లో కూడా మంచి బజ్ క్రియేట్ అయ్యింది ఈ సినిమాకు. దాంతో సౌత్ లో కూడా భారీ విజయాన్ని సాధించింది ఈ మూవీ.

ఇక యానిమల్ సినిమా థియేటర్స్ కు వచ్చి దాదాపు రెండు నెలలు కావస్తున్నా ఓటీటీ రిలీజ్ పై ఎలాంటి క్లారిటీ రాలేదు. నిజానికి ఆడియన్స్ కూడా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం చూస్తున్నారు. జనవరి 26న ఓటీటీకి రానుందని అనే వార్తలు కూడా వినిపించాయి.. డిజిటల్ రైట్స్ తీసుకున్న ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ కూడా అదే విషయాన్నీ కన్ఫర్మ్ చేసింది. అయితే.. అనుకోని విధంగా ఈ సినిమాపై కోర్టు స్టే విధించింది. దాంతో జనవరి 26న ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఉంటుందా ఉండదా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. 

తాజాగా ఈ విషయం క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాపై తలెత్తిన వివాదానికి తెరపడింది. రెండు పార్టీలు ఒక మాటపైకి రావడంతో వివాదం సద్దుమణిగింది. అదే విషయాన్ని కోర్టుకు తెలియజేయడంతో.. యానిమల్ ఓటీటీ రిలీజ్ పై స్టే ఎత్తివేసింది కోర్టు. ముందుగా అనుకున్నట్లుగానే జనవరి 26న ఈ సినిమా ఓటీటీలో రానుంది. దీంతో అనిమల్ సినిమా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి థియేటర్స్ లో భారీ హిట్ సాధించిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.