
న్యూఢిల్లీ : జార్ఖండ్లోని కొడెర్మా లోక్సభ స్థానం నుంచి గెలిచిన అన్నపూర్ణ దేవికి కేంద్ర మంత్రి పదవి దక్కింది. 1998లో ఆర్జేడీ నేత అయిన ఆమె భర్త రమేశ్ యాదవ్ సడెన్గా చనిపోయారు. అప్పటిదాకా హోంమేకర్గా ఉన్న ఆమె.. అనూహ్యంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఉప ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆర్జేడీ స్టేట్ చీఫ్గా కూడా పనిచేశారు. 2005 నుంచి 2014 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు.
2012లో ఇరిగేషన్ మంత్రిగా సేవలందించారు. 2019 లోక్సభ ఎన్నికలకు ముందు ఆమె బీజేపీలో చేరారు. కొడెర్మా లోక్సభ నుంచి బరిలోకి దిగి జార్ఖండ్ వికాస్ మోర్చా (ప్రజాతాంత్రిక్) నేత బాబులాల్ మరాండీపై 4.55 లక్షల మెజారిటీతో గెలిచారు. ఓబీసీ కమ్యూనిటీ కావడంతో జార్ఖండ్లో బీజేపీ మరింత బలోపేతమైంది. స్టేట్లో 45% ఓబీసీ కమ్యూనిటీకి చెందిన వారు ఉన్నారు.