వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్లో అన్ను రాణి తీవ్రంగా నిరాశ పరిచింది. మహిళల జావెలిన్ త్రోలో ఫైనల్ చేరిన అన్ను రాణి పతకం సాధించలేకపోయింది. వరుసగా రెండో ఎడిషన్లోనూ అన్ను రాణి పతకాన్ని అందుకోలేకపోయింది. ఫైనల్లో ఆమె జావెలిన్ను 61.12 మీటర్లు మాత్రమే విసిరింది.
ఫైనల్ పోరులో అన్ను రాణి ఏడో స్థానంలో నిలిచింది. తన పర్సనల్ బెస్ట్ అయిన 63.82 మీటర్ల మార్కును కూడా ఆమె అందుకోలేకపోయింది. ఇక జావెలిన్ త్రోలో ఆస్ట్రేలియాకు చెందిన కెల్సీలీ బార్బర్ 66.91 మీటర్లు జావెలిన్ను విసి స్వర్ణ పతకాన్ని సాధించింది. అమెరికాకు చెందిన కారా వింగర్ 64.05 మీటర్లు, జాపాన్ ప్లేయర్ హరుక కిటాగుచి 63.27 మీటర్ల దూరం విసిరి రజతం, కాంస్య పతకాన్ని నెగ్గారు.