ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్పై కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదు చేశారు. గాడిదతో కేసీఆర్ బర్త్ డే వేడుకలు జరపడంపై ఇప్పటికే జమ్మికుంట పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు పోలీసులు. జమ్మికుంటలో నమోదైన కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే సతీశ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాజాగా కొత్తపల్లి పోలీసు స్టేషన్లలోనూ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు అడిషనల్ డీసీపీ శ్రీనివాస్. మూగజీవి గాడిదను హింసించడంతో పాటు కేసీఆర్ ను అవమానించేలా ప్రవర్తించిన బల్మూరి వెంకట్ పై జంతు హింస చట్టం, ఐటీ యాక్టుల కింద కేసులు నమోదు చేశారు.
ప్రజాస్వామ్య పద్దతిలో భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ ఎదుటి వారి మనోభావాలను దెబ్బతీయకుండా..ఇతరులకు ఇబ్బందులు కలిగించకుండా ఉండాలని అడిషనల్ డీసీపీ సూచించారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా చేపల వ్యాన్ లో గాడిదను తీసుకొచ్చి, గాడిద మొహానికి సీఎం కేసీఆర్ ఫోటో పెట్టి మూగజీవి తో అమానుషంగా ప్రవర్తించారన్నారు డీసీపీ.
ఇవి కూడా చదవండి:
కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలకు వేలం
‘ఏక్ మినీ కథ’ హీరోయిన్ కావ్యా థాపర్ అరెస్ట్