హైదరాబాద్లో మరోసారి ఖగోళ అద్భుతం.. కొన్ని నిమిషాల పాటు నీడ మాయం

హైదరాబాద్లో మరోసారి ఖగోళ అద్భుతం.. కొన్ని నిమిషాల పాటు నీడ మాయం

హైదరాబాద్ నగరంలో  గురువారం (ఆగస్టు 3న) అరుదైన ఖగోళ అద్భుతం ఆవిష్కృతమైంది. మధ్యాహ్నం 12.23 గంటలకు జీరో షాడో డే  సందర్భంగా హైదరాబాద్ లో సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడి నిటారుగా ఉన్న వస్తువుల నీడ కొన్ని నిమిషాల పాటు కనిపించకుండా పోయింది. ఇదే అద్భుతం మే 9న కూడా ఆవిష్కృతం అయింది. 2023 ఏప్రిల్ 25న బెంగుళూరులో కూడా మధ్యాహ్నం 12.17 నిమిషాలకు ఎండలో ఉన్న వస్తువులు, మనుషుల నీడ మాయమైంది.

ALSO READ:ఫ్లైట్లో మండుతున్న వాసన.. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ల్యాండింగ్