జేఈఈ మెయిన్స్​ అప్లికేషన్​కు మరో చాన్స్

జేఈఈ మెయిన్స్​ అప్లికేషన్​కు మరో చాన్స్

న్యూఢిల్లీ: విదేశాలకు వెళ్లి చదవాలనుకుని జేఈఈ మెయిన్స్‌ 2000కు అప్లికేషన్ ​పెట్టుకోలేకపోయిన స్టూడెంట్స్​కు కేంద్రం గుడ్​ న్యూస్ ​చెప్పింది. ఈ స్టూడెంట్స్ కు జేఈఈ మెయిన్స్​కు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్న నేషనల్​టెస్టింగ్​ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది. అప్లికేషన్​విండోను మంగళవారం నుంచి రీఓపెన్ ​చేస్తున్నట్టు హెచ్​ఆర్డీ మినిస్టర్ రమేశ్ ​పోఖ్రియాల్ ​ట్వీట్ ​చేశారు. ఈ నెల 24వ తేదీ వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం ఇచ్చామన్నారు. జులై 18 నుంచి 23 వరకు దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్​ ఎగ్జామ్​ జరగనుంది.