ఐటీ కారిడార్​లో మరో ఫ్లైఓవర్, అండర్​పాస్

ఐటీ కారిడార్​లో మరో ఫ్లైఓవర్, అండర్​పాస్
  • జనవరి ఫస్ట్​తర్వాత ప్రారంభించేందుకు ఏర్పాట్లు
  • నాలుగేండ్ల పాటు కొనసాగిన పనులు
  • 2.2 కి.మీ మేర నిర్మాణానికి రూ.263 కోట్ల ఖర్చు

గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్​లో మరో ఫ్లైఓవర్, అండర్​పాస్​ అందుబాటులోకి రానుంది. ఐటీ ఉద్యోగులకు ట్రాఫిక్​ రద్దీ నుంచి కొంత మేర ఉపశమనం లభించనుంది. కొండాపూర్​ నుంచి కొత్తగూడ జంక్షన్​మీదుగా బొటానికల్ ​గార్డెన్​ వరకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్, కొత్తగూడ జంక్షన్​లో అండస్​పాస్​పనులు 95 శాతం పూర్తయ్యాయి. ప్రస్తుతం ఫ్లైఓవర్​ కింద రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నెల 25 లోపు పనులు కంప్లీట్​ చేయాలని ప్లాన్​ చేస్తున్న అధికారులు మంత్రి కేటీఆర్​తో ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.

నాలుగేండ్లుగా సాగిన ఫ్లైఓవర్​ పనులు

ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఎస్ఆర్డీపీ(స్ట్రాటజిక్ ​రోడ్​ డెవలప్​మెంట్ ప్లాన్)లో భాగంగా కొండాపూర్​ నుంచి బొటానికల్ గార్డెన్ జంక్షన్​వరకు 2.2 కి.మీ. మేర ఫ్లైఓవర్, కొత్తగూడ జంక్షన్​ వద్ద అండర్​పాస్ ​నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 2018లో శ్రీకారం చుట్టింది. రూ.199 కోట్ల నిధులు కేటాయించింది. 2020 ఏప్రిల్ నాటికి పనులు కంప్లీట్​ చేసి అందుబాటులోకి తీసుకురావాలని మొదట భావించగా, మధ్యలో కొవిడ్, ఆస్తుల సేకరణ కారణంగా లేట్​అయ్యింది. అలాగే కాంట్రాక్టర్​కు ఇవ్వాల్సిన బిల్లులు లేట్ అవ్వడంతో పనులు ఆలస్యం అయ్యాయి. రెండేళ్లలో కంప్లీట్​  చేయాల్సిన పనులు నాలుగేండ్లు పట్టాయి. ప్రాజెక్టు వ్యయం రూ.199 కోట్ల నుంచి రూ.263 కోట్లకు చేరింది. నిర్మాణ పనులు జరిగినన్ని రోజులు వాహనదారులు ట్రాఫిక్​తో ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం పనులు పూర్తికావడంతో ఇకపై ట్రాఫిక్ ​సమస్య తగ్గుతుందని సంతోషం వ్యక్తం 
చేస్తున్నారు. న్యూఇయర్​లో ఫ్లైఓవర్, అండర్​పాస్ ను ఓపెన్​ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఫ్లైఓవర్​ పెయింటింగ్ పనులు నడుస్తున్నాయి. గూగుల్​ఆఫీస్​నుంచి కొత్తగూడ జంక్షన్​ మీదుగా బొటానికల్​ గార్డెన్​ వైపు రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

ట్రాఫిక్​ తగ్గుద్ది

కొండాపూర్ ​నుంచి గచ్చిబౌలిలోని ఆఫీసుకు వెళ్లేందుకు గంట టైమ్ పడుతోంది. ట్రాఫిక్​లో నరకం కనిపిస్తోంది. డైలీ ఆఫీస్​కు లేట్ అవుతోంది. ఫ్లైఓవర్, అండర్ పాస్ అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ ​తగ్గుతుంది. కొంత ఉపశమనం లభిస్తుంది.

25 లోపు కంప్లీట్​ చేస్తం

పనులు మొత్తం పూర్తి కావొచ్చాయి. ప్రస్తుతం పెయింటింగ్​వర్క్ జరుగుతోంది. ఈ నెల 25 లోపు మొత్తం పనులు కంప్లీట్ చేస్తాం.

- పరమేశ్వర్, ఏఈ,​ ఎస్ఆర్​డీపీ ప్రాజెక్ట్