ఎకానమీని గాడిన పెట్టేందుకు మరో ప్యాకేజీ

ఎకానమీని గాడిన పెట్టేందుకు మరో ప్యాకేజీ
  • తయారవుతున్న ప్రపోజల్స్‌‌
  • త్వరలో వెలువడనున్న ప్రకటన

న్యూఢిల్లీ: కరోనా సెకండ్​వేవ్​ దెబ్బ నుంచి ఎకానమీని గట్టెక్కించేందుకు మరో స్టిములస్‌‌​ ప్యాకేజీ రెడీ అవుతోంది.లోకల్​ లాక్​డౌన్లతో గ్రోత్​ పడిపోతుందనే భయాలుండటంతో ఇంకో కొత్త ప్యాకేజీ తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. టూరిజం, ఏవియేషన్​, హాస్పిటాలిటీ ఇండస్ట్రీలు, చిన్న, మీడియం కంపెనీలను కాపాడేందుకు ప్రపోజల్స్​ను ఫైనాన్స్​ మినిస్ట్రీ రెడీ చేస్తోంది. ప్రపోజల్స్​పై ఇంకా చర్చలు జరుగుతున్నాయని సీనియర్​ ఆఫీసర్లు చెబుతున్నారు. ఈ డిస్కషన్స్​ ఇటీవలే మొదలయ్యాయని, ప్రకటన ఎప్పుడు చెయ్యాలనేది ఇంకా ఖరారు కాలేదని వారు పేర్కొంటున్నారు. కరోనా సెకండ్​వేవ్​ ఇండియా ఎకానమీని గట్టిగానే దెబ్బకొట్టింది. కేసుల సంఖ్య భారీగా ఉండటంతో ఆయా రాష్ట్రాలలో లోకల్​ లాక్​డౌన్లు విధించారు. దీంతో చాలా ఎకనమిక్​ యాక్టివిటీస్​ నిలిచిపోయాయి. మార్చి నెలలో సెకండ్​ వేవ్​ వచ్చినప్పటి నుంచి ప్రయాణాలపై ఆంక్షలు వచ్చాయి. గతంలోలాగా ఈసారి దేశమంతటా లాక్​డౌన్​ను పెట్టలేదు. కానీ, కేసులు రోజుకి 2 లక్షలకి చేరడంతో లోకల్​గానే రాష్ట్ర ప్రభుత్వాలు లాక్​డౌన్లను అమలు చేస్తున్నాయి. పారిశ్రామిక యాక్టివిటీస్​ ఎక్కువగా ఉండే రాష్ట్రాలలో కూడా లాక్​డౌన్లు విధించారు. వైరస్​ వ్యాప్తిని అడ్డుకునేందుకే ఈ లాక్​డౌన్లు తప్పనిసరయ్యాయి.

మారుతున్న అంచనాలు 
ఏప్రిల్​ 1 నుంచి మొదలయిన కొత్త ఫైనాన్షియల్​ ఇయర్​ కోసం గతంలో ఇచ్చిన గ్రోత్​ అంచనాలను అన్నింటినీ ఇప్పుడు మారుస్తున్నారు. బహుశా ఈ ఏడాది రెండంకెల గ్రోత్​ రావడం కష్టసాధ్యమేనని ఎనలిస్టులు చెబుతున్నారు. నిరుద్యోగం పెరగడంతోపాటు, సేవింగ్స్​ తగ్గిపోతున్నాయని, కన్జంప్షన్​ కూడా అనుకున్నంతగా ఊపందుకోవడం లేదని వారంటున్నారు. ఈ ఫైనాన్షియల్​ ఇయర్లో ఇండియా 12.5 శాతం గ్రోత్​ సాధిస్తుందని ఇంతకు ముందు ఇంటర్నేషనల్​ మానిటరీ ఫండ్​ (ఐఎంఎఫ్​) అంచనా వేసింది. ఈ అంచనాలను జులై నెలలో మరోసారి ఐఎంఎఫ్​ రివ్యూ చేయనుంది. మన రిజర్వ్​ బ్యాంకు మాత్రం ప్రస్తుత ఫైనాన్షియల్​ ఇయర్లో  గ్రోత్​ రేటు10.5 శాతంగా ఉంటుందని అంచనా వేస్తోంది.ఎకానమీ పుంజుకోవడానికి ఏదైనా చేయడానికి తగినంత వెసులుబాటు ప్రభుత్వానికి లేకుండా పోయిందని ఎకానమిస్టులు అంటున్నారు. రిజర్వ్​ బ్యాంకు నుంచి సుమారు లక్ష కోట్ల రూపాయల డివిడెండ్​ గవర్నమెంట్​కు వస్తోంది. అయినా, ఆర్థికపరమైన వెసులుబాటు కష్టమేనని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పన్ను మినహాయింపులతోనే కొత్త స్టిములస్‌‌​ ప్యాకేజ్​ ఉండొచ్చని నిర్మల్​ బంగ్​ ఈక్విటీస్​ ఎకానమిస్ట్​ తెరెసా జాన్​ చెప్పారు. ఆర్​బీఐ తాజాగా ఇచ్చిన డివిడెండ్​తో కొంత వెసులుబాటు కలిగినా, భారీగా ప్యాకేజీ ఇవ్వడం కేంద్ర ప్రభుత్వానికి కష్టమేనని ఆయన అన్నారు. దాంతో, ఎడిషినల్​ గ్యారంటీలు, పన్ను మినహాయింపులు, డిమాండ్​ పెంచే చర్యలు వంటివి మాత్రమే ప్రకటించే ఛాన్స్​ ఉందని పేర్కొన్నారు. ఇవన్నీ చేయాలన్నా ప్రభుత్వం మీద పెద్ద భారమే పడుతుందని చెప్పారు. కరోనా వైరస్​ కేసులు తగ్గు ముఖం పట్టాక, ఎకానమీని మళ్లీ గ్రోత్​ బాట పట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుంది. ఎకానమీని ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు ఫైనాన్స్​ మినిస్టర్​ నిర్మలా సీతారామన్​ ఇటీవలే వెల్లడించారు. ఎకానమిస్టులతో  స్టిములస్‌‌​ ప్యాకేజీపై  డిస్కషన్స్​ను కూడా నిర్వహించారని సీనియర్​ ఆఫీసర్లు చెబుతున్నారు. బడ్జెట్లో చెప్పిన ఖర్చుకు కట్టుబడి ఉంటూనే, హెల్త్​ సర్వీసెస్​, ఫుడ్​ సబ్సిడీలపై ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేసే అవకాశాలున్నాయి.

భారీ సాయం సాధ్యం కాదంటున్న ఎక్స్‌‌పర్టులు 
ఆసియాలోనే టాప్​ పెర్​ఫార్మర్​గా మన రూపాయి ఇటీవల ఎమర్జ్​ అయింది. మరోవైపు మన స్టాక్​ మార్కెట్లు కూడా ఫిబ్రవరిలోని ఆల్​ టైమ్​ హై వైపు మళ్లీ దూసుకెళ్తున్నాయి. ఇదే టైములో ప్రభుత్వం స్టిములస్‌‌​ ప్రపోజల్స్​ను రెడీ చేస్తుండటం గమనార్హం. ఎకానమీలో ఖర్చు పెరిగేందుకు ఈ ఏడాది ఏప్రిల్​లోనే కొన్ని రూల్స్​ను ఫైనాన్స్​ మినిస్ట్రీ ఈజీ చేసింది. క్యాపిటల్​ ఎక్స్​పెండిచర్​ కోసం ముందుగా అనుమతులు తీసుకోవక్కర్లేదని ఇతర మంత్రిత్వ శాఖలకు చెప్పింది. లాక్​డౌన్లతో ఇబ్బందులపాలయిన వలస కార్మికులకు నెలకు అయిదు కిలోల ఉచిత ఫుడ్​ గ్రెయిన్స్​ను అందించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. సెకండ్​ వేవ్​తో ఈ వలస కార్మికులు సిటీల నుంచి సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. ఏదేమైనప్పటికీ, లిబరల్​గా ప్యాకేజీలు ప్రకటించే అవకాశం ఫైనాన్స్​ మినిస్టర్​కు లేదని ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు లోన్ల రీపేమెంట్​ రూల్స్​ మార్చాలని దెబ్బ తిన్న రంగాల నుంచి రిజర్వ్​ బ్యాంకుపై వత్తిడి పెరుగుతోంది.