IPL 2023 : ఆర్సీబీకి మరో షాక్.. సీజన్ మొత్తానికి కీలక ప్లేయర్లు దూరం

IPL 2023 : ఆర్సీబీకి మరో షాక్.. సీజన్ మొత్తానికి కీలక ప్లేయర్లు దూరం

ఐపీఎల్ లో మొదటి మ్యాచ్ లో అద్భుత విజయం సాధించి జోరుమీదున్న ఆర్సీబీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఆ జట్టు కీలక ప్లేయర్లు గాయాల బారిన పడుతున్నారు. ముంబైతో జరిగిన మొదటి మ్యాచ్ లో బౌండరీ ఆపబోయి పేసర్ టాప్లీ తీవ్రంగా గాయపడ్డాడు. హుటాహుటిన హాస్పిటల్ కి తరలించగా.. టాప్లీ కుడి భుజం కదిలింది అని నిర్దారణ అయింది. ప్రథమ చికిత్సగా అతని భుజాన్ని డాక్టర్లు సరిచేశారు. అయితే, స్కానింగ్, మెరుగైన వైధ్యం కోసం టాప్లీ ఇంగ్లండ్ కు వెళ్లినట్లు ఆర్సీబీ యాజమాన్యం ప్రకటించింది. 

యువ బ్యాట్స్ మెన్ రజత్ పాటిదర్ కూడా జట్టుకు పూర్తిగా దూరం అయినట్లు ఇవాళ ఆర్సీబీ అధికారికంగా ప్రకటించింది. కాలి మడమ గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ కు రజత్ పాటిదార్ దూరం అవుతున్నట్లు తెలిపింది. అతను త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ట్విట్టర్ లో పేర్కొంది. పాటిదార్, టాప్లీ స్థానంలో ఎవరిని తీసుకోవాలన్నది కోచ్, మేనేజ్మెంట్ ఇంకా నిర్ణయించుకోలేదు. అయితే, ఇప్పటికే హేజిల్ వుడ్, విల్ జాక్స్ గాయాలతో టీంకు దూరం అయ్యారు. ఈ ఖాతాలో మరో ఇద్దరు చేరారు.