ఇరాన్‭లో కొనసాగుతున్న హిజాబ్ వ్యతిరేక నిరసనలు

ఇరాన్‭లో కొనసాగుతున్న  హిజాబ్ వ్యతిరేక నిరసనలు

ఇరాన్లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతున్నాయి. మహసా అమినీ మరణం తర్వాత చెలరేగిన నిరసనల్లో ఇప్పటి వరకు 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ బ్రిగేడియర్ జనరల్ అమిరాలి హజిజాదే ప్రకటించారు. ఆమె మరణం దేశంలోని ప్రతి ఒక్కరిపైనా ప్రభావం చూపిందని అభిప్రాయపడ్డారు. మృతుల్లో పోలీసులు, సైనికులు, మిలిషియా సభ్యులు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 

సెప్టెంబరులో మహసా అమీని అనే యువతి మృతితో ఇరాన్‌లో ఆందోళనలు మొదలయ్యాయి. హిజాబ్‌ సరిగా ధరించలేదన్న అభియోగంపై అక్కడి నైతిక విభాగం పోలీసులు అరెస్టు చేయగా, వారి కస్టడీలో తీవ్రంగా గాయపడి మరణించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆమె సొంత ప్రావిన్సు కుర్దిస్థాన్‌లో సెప్టెంబర్‌ 17న మొదలైన నిరసనలు క్రమంగా తీవ్రతరం అయ్యాయి. నిరసన ప్రదర్శనలను అల్లర్లుగా అభివర్ణిస్తున్న ఇరాన్‌.. వాటిని ఎక్కడికక్కడ అణిచివేసే ప్రయత్నాలు చేస్తోంది.