
- సిటీలోని రెగ్యులర్ కస్టమర్లకు డ్రగ్స్ బంద్ పెట్టిన బెంగళూరు, గోవా సప్లయర్లు
- అరెస్టులు, ఆస్తులు సీజ్ చేస్తారనే భయం
- కస్టమర్ల చైన్సిస్టమ్తో నెట్వర్క్ను ట్రేస్ చేస్తున్న టీ న్యాబ్ పోలీసులు
హైదరాబాద్, వెలుగు: డ్రగ్స్, గంజాయిని అరికట్టేందుకు ఏర్పాటు చేసిన యాంటీ నార్కొటిక్స్ బ్యూరో(టీ న్యాబ్) మంచి రిజల్ట్ ఇస్తున్నది. హైదరాబాద్ కస్టమర్లు అంటేనే డ్రగ్స్ పెడ్లర్స్లో వణుకు పుట్టిస్తున్నది. అత్యాధునిక టెక్నాలజీ, కస్టమర్ల చైన్సిస్టమ్తో డ్రగ్స్ సప్లయర్లను ట్రేస్ చేస్తున్నది.
ఇలాంటిదే మాదాపూర్ డ్రగ్స్ కేసు సహా బెంగళూర్ డ్రగ్ పెడ్లర్స్, గంజాయి ట్రాన్స్పోర్టర్లను వెంటాడి పట్టుకున్నది. డ్రగ్స్ పెడ్లర్లు దేశంలో ఎక్కడున్నా పట్టుకుంటాం, ఆస్తులు సీజ్ చేస్తామనే విధంగా టీ న్యాబ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నది. దీంతో హైదరాబాద్ డ్రగ్ కస్టమర్లు అంటేనే పెడ్లర్లు హడలిపోతున్నారు. ఇలా 7 వేల మంది కస్టమర్లలో రెగ్యులర్గా డ్రగ్స్ కొనుగోలు చేసే వారిని కూడా బ్లాక్లిస్ట్లో పెట్టినట్లు సమాచారం.
టూరిస్టులను టార్గెట్ చేస్తూ..
గోవాకు వచ్చే టూరిస్టులను స్థానిక డ్రగ్ పెడ్లర్లు మత్తులోకి దించుతున్నారు. ప్రధానంగా నైజీరియన్లు డ్రగ్స్ దందానే సెల్ఫ్ ఎంప్లాయిమెంట్గా చేసుకున్నారు. దేశవిదేశాల నుంచి వచ్చిన టూరిస్టులకు అవసరమైన డ్రగ్స్ ను సప్లయ్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి గోవాకు వెళ్లే టూరిస్టులను టార్గెట్ చేస్తున్న డ్రగ్స్ మాఫియా వారికి మత్తును అలవాటు చేస్తోంది.
ఇందులో కొకైన్, ఎండీఎంఏ, చరస్ను నైజీరియన్లు ఎక్కువగా సేల్ చేస్తున్నారు. బెంగళూరు, ముంబయి, గోవాలో షెల్టర్ తీసుకుంటూ దేశవ్యాప్తంగా సప్లయ్ చేస్తున్నారు. లోకల్ ఏజెంట్లకు కమీషన్స్ ఇచ్చి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఆన్లైన్లో డార్క్వెబ్ ద్వారా ఆర్డర్స్ తీసుకుని కొరియర్ల ద్వారా సప్లయ్ చేస్తున్నారు.
డొపమ్స్ యాప్.. సఫెమా యాక్ట్తో కట్టడి
ఇలా దేశవ్యాప్తంగా విస్తరించిన డ్రగ్స్ నెట్వర్క్ను రాష్ట్ర యాంటీ నార్కొటిక్స్ బ్యూరో బ్రేక్ చేస్తున్నది. ‘డ్రగ్ అఫెండర్స్ ప్రొఫైలింగ్ అనాలసిస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్’ (డీవోపీఏఎమ్ఎస్)తో డ్రగ్స్ పెడ్లర్లను ట్రేస్ చేస్తున్నది. డెకాయ్ ఆపరేషన్లతో దేశంలో ఎక్కుడున్నా అరెస్ట్ చేస్తున్నారు.
ఆ తర్వాత ‘స్మగ్లింగ్ అండ్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మానిప్యులేటర్స్’(-సఫెమా) యాక్ట్ కింద వారి ఆస్తులను సీజ్ చేస్తున్నారు. డ్రగ్స్, గంజాయి దందా చేస్తూ సంపాదించిన ఆస్తులను కోర్టుకు అప్పగిస్తున్నారు. దీంతో సప్లయర్లలో భయం మొదలైంది. ఎలాగైనా దొరికిపోతామనే అనుమానంతో సాధ్యమైనంత వరకు హైదరాబాద్ కస్టమర్లకు కాంటాక్ట్లోకి రావడం లేదు.
డార్క్వెబ్, ఇన్స్టాగ్రామ్తో పాటు సోషల్ మీడియాలో వస్తున్న ఆర్డర్లపై డ్రగ్స్ సప్లయర్లు అలర్ట్గా ఉంటున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే ఆర్డర్లకు డ్రగ్స్ సప్లయ్ చేయడం లేదు. ఇతర రాష్ట్రాలకు డైవర్ట్ చేస్తున్నట్లు సమాచారం.
దాడులు కొనసాగుతాయి
డ్రగ్స్ డిమాండ్ను తగ్గించినప్పుడే సప్లయ్ను అరికట్టగలం. ఇందులో భాగంగానే కన్జ్యూమర్లలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. కస్టమర్లు ఇచ్చే సమాచారంతోనే డ్రగ్స్ సప్లయర్లను గుర్తించి అరెస్ట్ చేస్తున్నాం. టీ న్యాబ్ ఆపరేషన్లు అన్ని సక్సెస్ అవుతున్నాయి.
బెంగళూర్, ముంబయి, గోవాలో ఎక్కుడున్నా అరెస్ట్ చేస్తున్నాం. దీంతో ఆన్లైన్, ఆఫ్లైన్లో హైదరాబాద్ నుంచి వచ్చే ఆర్డర్స్ అంటేనే పెడ్లర్లు భయపడుతున్నారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ను విచారిస్తాం.
- సీవీ ఆనంద్, టీ న్యాబ్ డైరెక్టర్