![అనుష్క, క్రిష్ కాంబోలో రెండో మూవీ.. సైలెంట్గా మొదలైన షూటింగ్](https://static.v6velugu.com/uploads/2024/02/anushkakrish-movie-regular-shooting-startedanushkakrish-movie-regular-shooting-started_GMr23k0JWF.jpg)
గత ఏడాది మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రంతో ఆకట్టుకున్న అనుష్క(Anushka), కొన్ని నెలల గ్యాప్ తర్వాత తిరిగి మరో తెలుగు చిత్రంలో నటిస్తోంది. కొత్త చిత్రాల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్న ఆమె, ఓ లేడీ ఓరియంటెడ్ మూవీకి సైన్ చేయడంతో పాటు షూటింగ్లోనూ పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.
ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో తనకు జరిగిన అన్యాయంపై పోరాటం చేసే ఓ సాధారణ అమ్మాయిగా అనుష్క కనిపించనుందట. హైదరాబాద్లో వేసిన ప్రత్యేకమైన సెట్లో గత కొద్ది రోజులుగా షూటింగ్ జరుగుతోంది. అనుష్కపై కీలక సన్నివేశాలు తీస్తున్నట్టు సమాచారం. ‘వేదం’ తర్వాత అనుష్క, క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రమిది. ఆ సినిమాకు సంగీతం అందించిన కీరవాణి, దీనికీ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు మలయాళంలో ‘కథనార్’ అనే చిత్రంలో నటిస్తోంది అనుష్క.