TDPది మోసాల మ్యానిఫెస్టో: సీఎం జగన్​

TDPది మోసాల మ్యానిఫెస్టో: సీఎం జగన్​

 2024 ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి మరో కొత్త డ్రామా మొదలు పెట్టారని సీఎం జగన్​ అసెంబ్లీ సమావేశాల్లో అన్నారు.   వేరే రాష్ట్రాల్లో ప్రజల్ని ఆకట్టుకున్న వాగ్ధానాలను  తీసుకొని   తల్లికి వందనం అంటూ చంద్రబాబు మరో కొత్త డ్రామా మొదలుపెట్టారన్నారు. చంద్రబాబు ఏ మ్యానిఫెస్టో తీసుకున్నా మోసాలేనన్నారు.  1994, 1999, -2014లో ఇచ్చిన మేనిఫెస్టోల్లోనూ అన్నీ  మోసాలే  కనపడతాయన్నారు.  

ALSO READ :- చంద్రబాబు అంటే  గుర్తొచ్చేది వెన్నుపోటు : సీఎం జగన్​

పేదలకు మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు సిద్ధం అయ్యారు.  తొలి సంతకాలు, సామాజిక వర్గాలు, రైతులు, పిల్లలు, అక్కచెల్లెమ్మలు, నిరుద్యోగులకు ఇచ్చిన దాదాపు 655 వాగ్దానాలుచ్చి.. వాటిల్లో పది శాతం కూడా తీర్చకుండా.. మేనిఫెస్టోను మాయం చేశాడంటే పరిస్థితి ఏమిటన్నది అనేది ...ఇలాంటి వ్యక్తిని 2024 ఎన్నికల్లో నమ్మడం కరెక్టేనా అని  ఆలోచించుకోవాలను సీఎం జగన్​ ప్రజలను కోరారు. ఎలాగూ ప్రజలు తమకు అధికారం ఇవ్వరని అనుకుంటన్న చంద్రబాబు గ్యాంబ్లింగ్‌ తరహాలో హామీలిస్తున్నాడు.వేర్వేరు రాష్ట్రాల్లోని హామీలను పట్టుకుని పేకాట ఆడటం మొదలుపెట్టాడని విమర్శించారు.