శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న సుప్రీంకోర్టు జడ్జి

శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న సుప్రీంకోర్టు జడ్జి

శ్రీశైలం, వెలుగు: శ్రీశైలం మల్లికార్జున స్వామిని ఆదివారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ముందుగా రత్న గర్భ గణపతిస్వామిని దర్శించుకున్నారు. అనంతరం మల్లికార్జునస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మల్లికాగుండంలో ప్రతిబింబించే ఆలయ విమాన గోపురాన్ని దర్శించుకున్నారు. భ్రమరాంబాదేవి అమ్మవారికి కుంకుమార్చన చేశారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తికి వేదాశీర్వచనం చేసి శేషవస్త్రాలు, ప్రసాదం అందజేసి, స్వామి, అమ్మవార్ల జ్ఞాపికను బహూకరించారు. ఆయన వెంట ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్  శ్రీనివాసరావు, డీఆర్వో బి పుల్లయ్య, దేవస్థానం ఈవో ఎస్. లవన్న ఉన్నారు.