ఏపీ సీఎస్ సమీర్ శర్మకు అస్వస్థత

ఏపీ సీఎస్ సమీర్ శర్మకు అస్వస్థత

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సెక్రటేరియట్ లో రివ్యూ చేస్తుండగా ఆయన అనారోగ్యానికి గురి కావడంతో ఆస్పత్రికి తరలించారు. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న సమయంలో సమీర్ శర్మ ఒక పక్కకు ఒరిగిపోయారు.

వెంటనే గుర్తించిన అధికారులు సమీర్ శర్మను 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. తాడేపల్లిలోని మణిపాల్ హాస్పిటల్ లో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురైన ఆయన  హైదరాబాద్ లో గుండెకు సంబంధించిన చికిత్స చేయించుకున్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుని తిరిగి విధులకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ మరోసారి అస్వస్థతకు గురయ్యారు.