నారాయణ విద్యాసంస్థల ఆఫీసుల్లో సీఐడీ సోదాలు

నారాయణ విద్యాసంస్థల ఆఫీసుల్లో సీఐడీ సోదాలు

హైదరాబాద్‭లో ఏపీ సీఐడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. మాజీ మంత్రి నారాయణ కార్యాలయంలో ఏపీ సీఐడీ సోదాలు నిర్వహిస్తోంది. మాదాపూర్‭లోని మెలాంజ్ టవర్స్‭లో గల నారాయణ కార్యాలయంలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అమరావతిలో చట్ట విరుద్ధంగా అసైన్డ్ భూముల కొనుగోలు, లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. నారాయణ సంస్థల నుంచి రామకృష్ణ హౌసింగ్ సంస్థల్లోకి నిధులు మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. ఆ నిధులతోనే నారాయణ బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేసినట్టు ఆరోపణలు రావడంతో ఏపీ సీఐడీ దర్యాప్తు చేస్తోంది. 

అమరావతి రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్‭లో మార్పులు చేర్పులు చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో CID కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు సహా మాజీ మంత్రి నారాయణలపై CId కేసులు నమోదు చేసింది. చంద్రబాబును A-1గా, నారాయణను A-2గా సీఐడీ చేర్చగా ఫిర్యాదు ఆధారంగా 120బి, 34, 420, 36,37,166 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆ ఫిర్యాదులో 2014--19 మధ్య భూసేకరణలో అవకతవకలు జరిగినట్టుగా పేర్కొన్నారు. అంతేకాదు ఆన్ లైన్ మెంట్ మార్పుతో రామకృష్ణ హోసింగ్, హెరిటేజ్ ఫుడ్స్, LEPL ప్రాజెక్ట్స్, లింగమనేని అగ్రికల్చర్ ఫామ్స్, జయని ఎస్టేట్స్‭కు లబ్ది కలిగించారని ఆరోపించారు.

దీనిపై అప్పట్లో నారాయణకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై నారాయణ హైకోర్టులో సవాల్ చేశారు. కోర్టు నుంచి అనుమతి పొంది అమెరికాలో చికిత్స చేసుకున్నారని నారాయణ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన హైకోర్టు హైదరాబాద్‭లోని నారాయణ నివాసంలో ఆయనను ప్రశ్నించాలంటూ ఏపీ సీఐడీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఇటీవల ఆయన ఇంట్లోనే అధికారులు స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు. ఇక ఇప్పుడు ఏపీ సీఐడీ సోదాలతో మరోసారి కలకలం రేగింది.