‘భీమ్లా నాయక్’కు జగన్ షాక్..

‘భీమ్లా నాయక్’కు జగన్ షాక్..

‘భీమ్లా నాయక్’ సినిమాకు షాక్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో జీవో 35ని కచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నెలాఖరు వరకే ఈ జీవో వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. దీంతో ఈ నెల 25న రిలీజ్ కానున్న భీమ్లా నాయక్ మూవీకి కష్టాలు తప్పేలా లేవు. కొన్ని రోజులుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు జగన్ ప్రభుత్వానికి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జగన్ సర్కార్ తప్పులను ఎప్పటికప్పుడూ ఎత్తి చూపుతున్నాడు పవన్. ఏపీ ప్రభుత్వాన్ని తన పదునైన మాటలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పవన్ పై.. అదే రేంజ్ లో రియాక్ట్ అవుతోంది ఏపీ సర్కార్. మొన్న నరసాపూర్ లో జరిగిన జనసేన సభలో ఏపీ సర్కార్ ను పవన్ ఘాటుగా విమర్శించాడు. అందుకు రియాక్షనే జీవో 35పై తాజా ఆదేశాలని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు.

సినీ పెద్దలు జగన్ తో జరిపిన చర్చల్లో జగన్ ప్రభుత్వం కొత్త జీవోను తెచ్చింది. అయితే ఆ జీవో మార్చి 1 నుంచి అమలు అవుతుందని ఏపీ ప్రభుత్వం తెలిపింది. అంతా సద్దుమణిగిందని అనుకుంటున్న ఈ తరుణంలో ఏపీ ప్రభుత్వం జీవో 35 అమలు చేయాలని ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాశంగా మారింది. జగన్ సర్కార్ పవన్ కల్యాణ్ ని టార్గెట్ చేసిందని ఆయన అభిమానులు ఆరోపిస్తున్నారు. 

మరిన్ని వార్తల కోసం..

ప‌వ‌న్ అభిమానుల‌కు గుడ్ న్యూస్

‘గంగూబాయి’ విడుదలకు తొలగిన అడ్డంకులు