ఏపీలో కొత్త కేసులు 1,345.. మరణాలు 4

ఏపీలో కొత్త కేసులు 1,345.. మరణాలు 4

అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 1,345 కొత్త కేసులు, నాలుగు మరణాలు నమోదయ్యాయి.  రాష్ట్ర వ్యాప్తంగా 26,393 మందికి పరీక్షలు చేయగా 1,345 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. అలాగే కరోనా సోకిన వారిలో చిత్తూరు, కృష్ణా, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున నలుగురు చనిపోయారు. మరో వైపు 6 వేల 576 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కొత్త కేసుల్లో తూర్పు గోదావరి జిల్లాల్లో అత్యధిక కేసులు 309, అతితక్కువగా విజయనగరం జిల్లాలో 16 కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా నమోదైన కొత్త కేసులు, చికిత్స పొందుతున్న కేసులు, రికవరీ అయిన వారి వివరాలు కింది పట్టికలో చూడండి...

 

 

 

ఇవి కూడా చదవండి

ఆఫ్ లైన్ ద్వారా తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల జారీ

తక్కువ రేట్లకు వినోదాన్ని అందించాలనేదే ప్రభుత్వ ఉద్దేశం

ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల