షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన జాప్యంతో నష్టపోతున్నాం  : ఏపీ

షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన జాప్యంతో నష్టపోతున్నాం  : ఏపీ

ఢిల్లీ: ఏపీ విభజన చట్టంలోని షెడ్యూల్ తొమ్మిది, పది సంస్థల విభజనలో ఆలస్యంపై సుప్రీంకోర్టు లో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈ షెడ్యూల్లో ఉన్న సంస్థల విలువ దాదాపు1,42,601 కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపింది.  ఈ సంస్థలు దాదాపు 91%  తెలంగాణలోనే ఉన్నాయని గుర్తు చేసింది. ఇందులో పనిచేస్తున్న దాదాపు లక్ష మందికిపైగా ఉద్యోగులు అనిశ్చిత పరిస్థితుల్లో ఉన్నారని పేర్కొంది. ఈ సంస్థల విభజన ఆలస్యం కావడం వల్ల ఏపీ నష్టపోతోందని తెలిపింది. విభజన అంశంలో తెలంగాణ స్పందించకపోవడం.. ఏపీ ప్రజల ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అవుతుందని వ్యాఖ్యానించింది. తక్షణమే సంస్థల విభజనకు తగిన ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం కోరింది.