అరసున్నా... అరసున్నా కలిసి గుండుసున్నా కోసం చర్చించారు.. టీడీపీ, జనసేనపై మంత్రి రోజా సెటైర్లు

అరసున్నా... అరసున్నా కలిసి గుండుసున్నా కోసం చర్చించారు.. టీడీపీ, జనసేనపై మంత్రి రోజా సెటైర్లు

 అరసున్న.... అరసున్న ...కలిసి  జైలులోని గుండు సున్నపై చర్చించారని ఏపీ మంత్రి ఆర్ కే రోజా  టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశంపై సెటైర్లు వేశారు. మంగళవారంనాడు (అక్టోబర్ 24)  ఏపీ మంత్రి రోజా  తిరుపతి జిల్లాలో మీడియాతో మాట్లాడారు.నిజమే కనుక గెలిస్తే చంద్రబాబుతో పాటు లోకేష్, భువనేశ్వరి జీవితాంతం  జైల్లోనే ఉంటారన్నారు.

చంద్రబాబు జైలు నుండి వచ్చే పరిస్థితి లేదని ఆమె చెప్పారు.చంద్రబాబు శాశ్వతంగా జైలులో ఉండాలని భువనేశ్వరి పూజలు చేసినట్టున్నారని ఆమె ఎద్దేవా చేశారు.ఇటు ఆరుగురు, అటు ఆరుగురు కూర్చొని సెలక్షన్ చేశారని నిన్న జరిగిన టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశంపై సెటైర్లు చేశారు.నిజం గెలవాలని తాము కోరకుంటున్నామన్నారు.

టీడీపీ, జనసేన  సమన్వయ కమిటీ సమావేశం చూస్తుంటే ఏదో పాడుతా తీయగా సెలక్షన్ జరుగుతున్నట్లు అనిపించిందని అన్నారు. అసలు అది సమన్వయ కమిటీ సమావేశం మాదిరిగా లేదని చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ టీం ఒకవైపు, నారా లోకేశ్ టీం ఒకవైపు కూర్చుని టీం సెలక్షన్ జరిగినట్లు ఉందని ఎద్దేవా చేశారు.  రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం దిశానిర్దేశం చేసేందుకే తాము సమావేశమయ్యామని ఇరు పార్టీల నేతలు చెప్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. 

ALSO READ: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా భువనేశ్వరి

 నారా భువనేశ్వరి చేపట్టబోయే నిజం గెలవాలి కార్యక్రమంపైనా మంత్రి ఆర్‌కే రోజా తనదైన శైలిలో సెటైర్లు వేశారు. స్కిల్ స్కాం కేసులో నిజం గెలిస్తే చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు నారా లోకేశ్, భువనేశ్వరి సైతం జీవితాంతం జైల్లు ఉండే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయని అన్నారు. నిజం గెలవాలని మనస్ఫూర్తిగా నారా భువనేశ్వరి భావిస్తే స్కిల్ స్కాంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేయాలని మంత్రి ఆర్‌కే రోజా డిమాండ్ చేశారు