నీతి ఆయోగ్ ర్యాంకులు: ఏపీకి మూడు.. తెలంగాణకు ఆరో స్థానం

నీతి ఆయోగ్ ర్యాంకులు: ఏపీకి మూడు.. తెలంగాణకు ఆరో స్థానం
  • మరోసారి టాప్ ర్యాంక్‌‌లో కేరళ
  • అట్టడుగున బీహార్‌

న్యూఢిల్లీ, వెలుగు: నీతి ఆయోగ్ సస్టెయినబుల్ డెవలప్ మెంట్ గోల్స్ (ఎస్డీజీ) ఇండెక్స్ 2020-=21 లో  ఏపీ మూడో ర్యాంకులో నిలవగా, తెలంగాణకు ఆరో స్థానం దక్కింది. పలు అంశాల్లో మంచి పనితీరు కనబరిచినందుకు 72 స్కోర్ తో ఏపీ టాప్ ఐదులో నిలవగా, 69 స్కోర్ తో గుజరాత్ తో కలిసి తెలంగాణ ఆరో ర్యాంకులో నిలిచింది.  నీతి ఆయోగ్ చైర్మన్ రాజీవ్ కుమార్ ఎస్డీజీ ఇండెక్స్ ను గురువారం రిలీజ్ చేశారు. సామాజిక, ఆర్థిక, పర్యావరణ అంశాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ర్యాంకులు కేటాయించారు. ఇందులో 75 స్కోర్‌‌తో కేరళ ఫస్ట్ ర్యాంక్‌‌ను మరోసారి నిలబెట్టుకుంది.74 స్కోర్ తో హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు రెండో ర్యాంకు సాధించాయి. బీహార్, జార్ఖండ్, అస్సాం రాష్ట్రాలు అట్టడుగున నిలిచాయి.