ఏపీలో 8,555 కరోనా పాజిటివ్‌ కేసులు.. ఒక రోజులో 52,834 టెస్టులు

ఏపీలో 8,555 కరోనా పాజిటివ్‌ కేసులు.. ఒక రోజులో 52,834 టెస్టులు
  • 1,58,764కు చేరిన కేసుల సంఖ్య
  • ఒక రోజులో 63 మంది మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటల్లో 8,555 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు 52,834 శ్యాంపిల్స్‌ను పరీక్షించినట్లు అధికారులు హెల్త్‌ బులిటెన్‌ రిలీజ్‌ చేశారు. రాష్ట్రంలో మొత్తం 1,58,764 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని అన్నారు. వారిలో ఇప్పటి వరకు 82,886 మంది డిశ్చార్జ్‌ అవగా 74,404 మంది హాస్పిటల్స్‌లో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. 24 గంటల్లో 63 మంది చనిపోయారు. దీంతో చనిపోయిన వారి సంఖ్య 1474కి చేరింది. కృష్ణలో పదకొండు మంది, గుంటూరులో ఎనిమిది మంది, తూర్పు గోదావరి, విశాఖల్లో ఏడుగురు, కర్నూలు, నెల్లూరులో ఆరుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు, ప్రకాశంలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, కడపలో ముగ్గురు, విజయనగరంలో ముగ్గురు, అనంతపూర్‌‌లో ఇద్దరు, పశ్చిమగోదావరిలో ఒకరు చనిపోయారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 20,65,407 కరోనా టెస్టులు చేశారు.