తెలుగుదేశం పార్టీకి వచ్చిన విరాళాలను అవినీతి సొమ్ముగా చూపడాన్ని ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు విమర్శించారు. నాలుగు దశాబ్దాలు ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసిన చంద్రబాబును జైల్లో పెట్టాడాన్ని ఆయన తప్పు పట్టారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరినుంచి దుష్ప్రచారం చేస్తూ లేని అవినీతిని ఉన్నట్టుగా చూపేందుకు ప్రయత్నిస్తుందన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేష న్లో ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అంశాల్లో కూడా అవినీతి జరిగిందని వైసీపీ నేతలు విషప్రచారం చేస్తున్నారన్నారు.
- ALSO READ | చంద్రబాబు బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా..
స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ వ్యవహారానికి సంబంధించిన అన్నివిషయాలు వెల్లడిస్తూ ఒక పుస్తకాన్ని ఆవిష్కరించామన్నారు. ఇంకా ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ అంశాలను కూడా ప్రజలకు తెలియచేసేందుకు వాటికి సంబంధించిన పూర్తి సమాచారంతో పుస్తకాలు విడుదల చేశామని అచ్చెన్నాయుడు తెలిపారు.