
అక్టోబర్ 6 న ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది కేంద్ర జలశక్తిశాఖ. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల సీఎస్ లకు కేంద్ర జలశక్తి శాఖ లెటర్ రాసింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్షతన మీటింగ్ ఉంటుందని చెప్పింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ మీటింగ్ ఉంటుందని.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులను మీటింగ్ గు ఆహ్వానించినట్లు తెలిపింది కేంద్ర జలశక్తి శాఖ.