- కేంద్రానికి కేరళ హైకోర్టు సూచన
కోచి: కొవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్నంక 4 వారాల తర్వాత రెండో డోసు వేసుకునేందుకు అవకాశమివ్వాలని కేరళ హైకోర్టు కేంద్రానికి సూచించింది. రెండు డోసులమధ్య గ్యాప్తగ్గించుకోవాలని భావించేటోళ్లకు వీలు కల్పించాలంది. కొవిన్ యాప్లో అవసరమైన మార్పులు చేయాలని సూచించింది. రాష్ట్రంలో కరోనా కేసులు చాలా ఎక్కువగా నమోదవుతున్న క్రమంలో కోర్టు ఈ కామెంట్ చేసింది. ప్రస్తుతం కొవిషీల్డ్ వేసుకున్నోళ్లకు 84 రోజుల తర్వాత రెండో డోసు వేస్తున్నారు.విదేశాలకు వెళ్లేటోళ్లకు రెండో డోసు ముందే వేస్తున్నరు. 12 వారాల గ్యాప్ రూల్కు మినహాయింపు ఇస్తున్నారు. అదేవిధంగా కొవిషీల్డ్ రెండో డోసును గడువు కన్నా ముందే వేసుకోవాలని భావించేటోళ్లకు కూడా ఈ మినహాయింపు ఎందుకు ఇవ్వరని కోర్టు ప్రశ్నించింది.