పల్స్ విటమిన్ డి3 మందుకు ఆమోదం

పల్స్ విటమిన్ డి3 మందుకు ఆమోదం

హైదరాబాద్​, వెలుగు: నానో-క్యారియర్ ఎంట్రాప్డ్ విటమిన్ డి3 మందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) నుంచి ఆమోదం వచ్చిందని హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన పల్స్ ఫార్మా  తెలిపింది.  నోటితో తీసుకునే విటమిన్​డీ3 ఓరల్​సస్పెన్షన్​ మరింత సమర్థంగా పనిచేసేందుకు విప్లవాత్మక నానోపార్టికల్ టెక్నాలజీ ఉపయోగపడుతుందని కంపెనీ ఎండీ  కేవీ రాంబాబు తెలిపారు.

సంప్రదాయ ఫార్ములాలతో పోలిస్తే ఈ కొత్త విధానంలో శరీరానికి 60 శాతం ఎక్కువ సీరమ్ విటమిన్ డీ అందుతుందని చెప్పారు.  ఈ కొత్త టెక్నాలజీకి యూఎస్ఎఫ్​డీఏ ఆమోదం కూడా పొందడానికి సంస్థ ప్రయత్నిస్తోంది.

ఈయూ పేటెంట్ తుది దశలో ఉందని, ఇతర ప్రొప్రైటరీ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫారమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల కోసం పేటెంట్లు దాఖలు చేశామని, ఇతర మందుల కోసం కూడా నానో పార్టికల్​ టెక్నాలజీ వాడతామని రాంబాబు పేర్కొన్నారు.