సేవల జోరుతో క్యూ1 జీడీపీ గ్రోత్​ @ 7.8 %.. చైనా కంటే ఎక్కువే

సేవల జోరుతో క్యూ1 జీడీపీ గ్రోత్​ @ 7.8 %..   చైనా కంటే ఎక్కువే

న్యూఢిల్లీ: ఏప్రిల్​–జూన్​ మధ్య కాలంలో సర్వీసెస్​ సెక్టార్ ​సాయంతో దేశ జీడీపీ 7.8 శాతం గ్రోత్​ సాధించింది. గత నాలుగు క్వార్టర్లలో చూస్తే ఈ గ్రోతే అత్యధికం. ముఖ్యంగా సేవల రంగం రెండంకెల గ్రోత్​ రికార్డు చేసింది. ఫలితంగా ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ఎకానమీ  కిరీటాన్ని ఇండియా నిలబెట్టుకుంది. 2022–23 మొదటి క్వార్టర్లో జీడీపీ గ్రోత్​13.1 శాతంగా నమోదయిన విషయం తెలిసిందే.  ఆ తర్వాత మూడు క్వార్టర్లలోనూ జీడీపీ గ్రోత్​ వరసగా 6.2, 4.5, 6.1 శాతంగా రికార్డయింది. 

2023–24 ఫైనాన్షియల్​ ఇయర్​ క్యూ1 లో చైనా జీడీపీ గ్రోత్​ రేటు 6.3 శాతం కంటే మన దేశ జీడీపీ గ్రోత్‌ రేటు  ఎక్కువగా  అంటే 7.8 శాతం గా ఉంది.  నేషనల్​ స్టాటిస్టికల్​ ఆఫీస్​ (ఎన్​ఎస్​ఓ) ఈ తాజా డేటాను గురువారం రిలీజ్​ చేసింది. మొదటి క్వార్టర్లో గ్రాస్​ వాల్యూ ఎడిషన్​ (జీవీఏ) పరంగా  అగ్రికల్చర్​ రంగం 3.5 శాతం, ఫైనాన్షియల్​, రియల్​ ఎస్టేట్​, ప్రొఫెషనల్​ సర్వీసెస్​ రంగాలు 12.2 శాతం గ్రోత్​ రికార్డు చేశాయి.  మాన్యుఫాక్చరింగ్​ రంగంలో  గ్రోత్  రేటు  కిందటేడాది క్యూ1 లో 6.1 శాతమైతే, ఈ క్యూ1 లో 4.7 శాతానికి పడిపోయింది.

వర్షం తక్కువైనా జీడీపీ గ్రోత్ ​6.5 శాతానికి..

వర్షపాతం తక్కువైనా ప్రస్తుత ఫైనాన్షియల్​ ఇయర్​ (2023–24) లో దేశ ఎకానమీ 6.5 శాతం గ్రోత్​ రేటు సాధిస్తుందని చీఫ్​ ఎకనమిక్​ ఎడ్వైజర్​ వీ అనంత నాగేశ్వరన్​ వెల్లడించారు. రేట్ల పెరుగుదల (ఇన్​ఫ్లేషన్​) చేయి దాటిపోతుందని భయపడాల్సిన అవసరం ఏమీ లేదని స్పష్టం చేశారు. 

ఆర్​బీఐ, ప్రభుత్వం ధరలు అదుపులో ఉంచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు. మార్కెట్లోకి తాజా స్టాకులు రావడంతో ఫుడ్​ ఇన్​ఫ్లేషన్​( ఆహార వస్తువుల రేట్లు) తగ్గుముఖం పడుతుందని పేర్కొన్నారు. ఆగస్టు నెలలో తక్కువగా పడిన వర్షాల ఎఫెక్ట్​ ఏ మేరకు ఉంటుందనేది వేచి చూడాల్సి ఉందని అన్నారు.