మంథని, వెలుగు : మంథని తహసీల్దార్ గా అరిఫోద్దీన్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పని చేస్తున్న కుమారస్వామి బదిలీ పై కలెక్టరేట్ కు వెళ్లగా, అక్కడ పనిచేస్తున్న అరిఫోద్దీన్ మంథనికి వచ్చారు.
ఈ సందర్బంగా తహసీల్దార్ ను పలువురు నాయకులు కలిసి శాలువాతో సన్మానించారు. తహసీల్దార్ను కలిసిన వారిలో నాయకులు గోగుల రాజిరెడ్డి, విజయ్ కుమార్, బూడిద తిరుపతి, బెజ్జంకి డిగంబర్ తదితరులు ఉన్నారు.
