గోవాకు ఆడనున్న అర్జున్‌‌‌‌ టెండూల్కర్‌‌!

గోవాకు ఆడనున్న అర్జున్‌‌‌‌ టెండూల్కర్‌‌!

న్యూఢిల్లీ: ఇండియా లెజెండరీ క్రికెటర్‌‌ సచిన్‌‌ టెండూల్కర్‌‌ కుమారుడు అర్జున్‌‌.. ముంబై టీమ్‌‌ను వీడనున్నాడు. వచ్చే డొమెస్టిక్‌‌ సీజన్‌‌లో అర్జున్‌‌.. గోవా జట్టు తరఫున ఆడేందుకు ప్లాన్స్‌‌ చేసుకుంటున్నాడు. ఇందుకోసం ఎంసీఏ నుంచి ఎన్​వోసీ కోరాడు. 22 ఏళ్ల లెఫ్టార్మ్‌‌ పేసర్‌‌ అర్జున్‌‌.. 2020–21 సీజన్‌‌లో ముంబై తరఫున సయ్యద్‌‌ ముస్తాక్‌‌ అలీ ట్రోఫీలో రెండు మ్యాచ్‌‌లే ఆడాడు. ‘ఈ వయసులో అర్జున్‌‌కు ఎక్కువ మ్యాచ్‌‌లు ఆడటం చాలా అవసరం. ఈ మార్పు వల్ల అతను మరిన్ని మ్యాచ్‌‌లు ఆడే అవకాశం వస్తుందని నమ్ముతున్నాం’ అని ఎస్‌‌ఆర్‌‌టీ స్పోర్ట్స్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ పేర్కొంది.