న్యూఢిల్లీ: ఇండియా లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్.. ముంబై టీమ్ను వీడనున్నాడు. వచ్చే డొమెస్టిక్ సీజన్లో అర్జున్.. గోవా జట్టు తరఫున ఆడేందుకు ప్లాన్స్ చేసుకుంటున్నాడు. ఇందుకోసం ఎంసీఏ నుంచి ఎన్వోసీ కోరాడు. 22 ఏళ్ల లెఫ్టార్మ్ పేసర్ అర్జున్.. 2020–21 సీజన్లో ముంబై తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రెండు మ్యాచ్లే ఆడాడు. ‘ఈ వయసులో అర్జున్కు ఎక్కువ మ్యాచ్లు ఆడటం చాలా అవసరం. ఈ మార్పు వల్ల అతను మరిన్ని మ్యాచ్లు ఆడే అవకాశం వస్తుందని నమ్ముతున్నాం’ అని ఎస్ఆర్టీ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ పేర్కొంది.