ఆర్మూర్‌ మున్సిపల్‌ భవనానికి రూ.5 కోట్లు : ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి

ఆర్మూర్‌ మున్సిపల్‌ భవనానికి రూ.5 కోట్లు :  ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి

ఆర్మూర్‌, వెలుగు : ఆర్మూర్‌ మున్సిపల్‌ ఆఫీస్‌ నూతన భవన నిర్మాణానికి సీఎం రేవంత్‌ రెడ్డి రూ.5 కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో ఆదివారం సీఎం రేవంత్‌ రెడ్డిని  మర్యాదపూర్వకంగా కలిసి భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేసినట్లు చెప్పారు.

సీఎం సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. మున్సిపల్‌ భవన నిర్మాణానికి భూమిపూజతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం త్వరలోనే ఆర్మూర్‌ నియోజకవర్గానికి వస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు తెలిపారు. మున్సిపల్‌ బిల్డింగ్‌కు రూ.5 కోట్లు మంజూరు చేసినందుకు సీఎంకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.