ఆర్మూర్ మండలంలో రిలీఫ్ సర్టిఫికెట్, ఆర్థిక సాయం అందజేత

ఆర్మూర్ మండలంలో రిలీఫ్ సర్టిఫికెట్,  ఆర్థిక సాయం అందజేత

ఆర్మూర్​, వెలుగు: నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​ మండలం మగ్గిడి, ఆలూర్​మండలం దేగాం గ్రామాల్లో ఇటుకబట్టిలో వెట్టి చాకిరి నుంచి విముక్తి అయిన కార్మికులపై గురువారం ఆర్మూర్​సబ్​ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, సీనియర్​ సివిల్​ జడ్జి శ్రీదేవి సమావేశమయ్యారు. తమిళనాడు, ఆంధ్రకు  చెందిన 37 మంది కార్మికులకు రిలీఫ్​ సర్టిఫికెట్స్​ అందజేశారు. 

ఇందులో 22 మంది కార్మికులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి ద్వారా రూ.30వేల చొప్పున పరిహారం ఇచ్చారు. వీరిలో నలుగురు బాలకార్మికులను గుర్తించారు. అనంతరం వారిని బస్సుల్లో స్వస్థలాలకు పంపించారు. తహసీల్దార్​ సత్యనారాయణ, లేబర్​ డిప్యూటీ కమిషనర్​ యాదయ్య, అసిస్టెంట్​ కమిషనర్​ శ్రావణి, ఎస్‌‌‌‌హెచ్‌‌‌‌వో సత్యనారాయణ గౌడ్ పాల్గొన్నారు.