
ఐదుగురు గుప్తనిధుల వేటగాళ్లను అటవీ అధికారులు అరెస్టు చేశారు. ఆత్మకూరు మండలం బైర్నూటి అటవీ ప్రాంతంలోని తిరుమలగిరి కొండపై పురాతన ఆలయం ఉంది. అక్కడ గుప్త నిధులున్నాయని వెలుగోడు పట్టణానికి చెందిన ఐదుగురు గ్రామస్తులు ప్రయత్నించారు. వారు ఆ ప్రాంతంలో తిరుగుతుండడాన్ని గమనించిన అటవీ అధికారులు ఆరా తీశారు. వారు పొంతన లేని సమాధానం చెప్పడంతో లోతుగా విచారించగా గుప్తనిధులను తవ్వేందుకు వచ్చామని అధికారులకు తెలిపారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన అధికారులు రిమాండ్ కు తరలించారు.