- తోటి ఉద్యోగి సర్వీస్ బుక్ఇవ్వడానికి లంచం డిమాండ్
- ఎంపీడీవో చెప్పడంతో తీసుకున్నానన్న హరిబాబు
- ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న అధికారులు
నిజామాబాద్/భిక్కనూరు, వెలుగు: బాల్కొండ సెగ్మెంట్కమ్మర్పల్లి ఎంపీడీవో ఆఫీస్లో సీని యర్ అసిస్టెంట్ హరిబాబు మరో ఉద్యోగి నుంచి రూ.8 వేల లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీకి రెడ్హ్యాండెడ్గాచిక్కాడు. గత ఎంపీడీవో సంతోష్రెడ్డి సూచన మేరకే లంచం తీసుకున్నట్లు చెప్పడంతో ఇద్దరిపై కేసు నమోదైంది. ఏసీబీ డీఎస్పీ శేఖర్గౌడ్ కథనం ప్రకారం..అసెంబ్లీ ఎన్నికల సమయంలో బాగయ్య అనే సీనియర్అసిస్టెంట్ కమ్మర్పల్లి ఎంపీపీ ఆఫీస్లో ఇన్చార్జ్ఎంపీవోగా డ్యూటీ చేశాడు. రెగ్యులర్ ఎంపీవో వచ్చాక మూడు నెలల కింద ఇందల్వాయి మండలానికి బదిలీ అయ్యాడు. కమ్మర్పల్లిలో పనిచేసిన వివరాలను సర్వీస్బుక్లో ఎంట్రీ చేయాలని ఎంపీడీవో సంతోష్రెడ్డికి బుక్ ఇవ్వగా రూ.10 వేల లంచం డిమాండ్ చేశాడు.
పార్లమెంట్ఎన్నికల నేపథ్యంలో కమ్మర్పల్లి ఎంపీడీవోగా ఉన్న సంతోష్రెడ్డి నెల కింద భిక్కనూర్ మండలానికి ట్రాన్స్ఫర్ అయ్యాడు. అంతకు ముందే బాగయ్య సర్వీస్బుక్లో ఎంటర్ చేయాల్సిన వివరాలు రాసి రూ.10 వేలు ఇచ్చేదాకా బుక్ ఇవ్వొద్దని సీనియర్ అసిస్టెంట్ హరిబాబుకు అప్పగించాడు. బాగయ్య సర్వీస్ బుక్ కోసం సీనియర్అసిస్టెంట్హరిబాబును కలువగా ఎంపీడీవో సంతోష్రెడ్డి చెప్పిన లంచం గురించి ప్రస్తావించాడు. రూ.8 వేలకు ఒప్పందం చేసుకున్న బాగయ్య విషయాన్ని ఏసీబీకి చేరవేయగా డీఎస్పీ శేఖర్గౌడ్ నేతృత్వంలో రైడ్ నిర్వహించి హరిబాబును రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎంపీడీవో సంతోష్రెడ్డి చెప్పినట్టే చేశానని చెప్పగా భిక్కనూర్ ఆఫీస్ నుంచి సంతోష్రెడ్డిని కమ్మర్పల్లికి తీసుకొచ్చారు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ శేఖర్గౌడ్ వెల్లడించారు.