జమ్ము కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370, 35A దేశంలోకి ఉగ్రవాదం ప్రవేశించడానికి రహదారులుగా మారాయనన్నారు కేంద్ర రక్షణ మంత్రి అమిత్షా. ప్రధాని నరేంద్ర మోడీ ఆ ఆర్టికల్స్ను రద్దు చేయడంతో ఉగ్రవాదానికి దారులు మూసుకుపోయాయన్నారు. సర్దార్ పటేల్ కలను ప్రధాని మోడీ సాకారం చేశారని అమిత్షా అన్నారు. ఆర్టికల్ 370, 35Aను రద్దు చేయడం ద్వారా జమ్ము కశ్మీర్ను శాశ్వతంగా భారత్లో విలీనం చేశారని చెప్పారు.