ఆకర్షిస్తోన్న చికాగో ఆర్టిస్ట్ వేసిన ఆయిల్ పెయింటింగ్

ఆకర్షిస్తోన్న చికాగో ఆర్టిస్ట్ వేసిన ఆయిల్ పెయింటింగ్

కొన్ని పెయింటింగ్స్ ను చూస్తే అలానే చూస్తూనే ఉండాలనిపిస్తుంది. అలాంటి పెయింటింగ్స్ లో ఒకటి చికాగోకు చెందిన ఆర్టిస్ట్ సీమస్ వ్రే వేసిన చిత్రాలు. చిత్రాల వరుసలను ఒకే పెయింటింగ్ లో చూపిస్తోన్న ఈ కళాకారుడు వేసిన ఓ స్వీయ చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. నిజానికి ఈ సిరీస్ ఆయిల్  పెయింటింగ్ ను వ్రే 2020లోనే పోస్ట్ చేశాడు. కానీ రీసెంట్ గా వైరల్ అయింది.

రెడ్జిట్ లో పోస్ట్ అయిన ఈ ఫొటోలో మిస్టర్ సీమస్ వ్రే తాను పెయింటింగ్ వేస్తున్నట్టు, దాంట్లో మళ్లీ తాను పెయింటింగ్ వేస్తున్నట్టు అత్యద్భుతంగా చిత్రీకరించాడు.  ఇలా ఐదు పెయింటింగ్ ల శ్రేణిని ఒకే పెయింటింగ్ లో చూపిస్తూ తనలో ఇమిడి ఉన్న సృజనాత్మకతను కళ్లకు కట్టినట్టు చూపించాడు. అప్పట్లో వ్రే పోస్ట్ చేసిన ఈ ఫొటోకు మీరు కళాకారుడిగా ఉన్నప్పుడు, మీరు బోర్ గా ఫీలైనపుడు అనే క్యాప్షన్ ను జత చేశాడు. ఈ అరుదైన పిక్ పై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేయడంతో పాటు, అద్భుతంగా ఉందంటూ సీమస్ వ్రేను ప్రశంసిస్తున్నారు. 

https://preview.redd.it/b1ehie4krl5a1.jpg?width=1080&format=pjpg&auto=webp&s=3da46ccbbfd9f4e02dc5c92c91925536e0911925